యూ.ఏ.ఈ:వర్క్ పర్మిట్లు,రెసిడెన్స్ వీసాలు ఆటోమేటిక్ గా జారీ చేయబడతాయి
- March 26, 2020యూ.ఏ.ఈ:మానవ వనరులు & ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ మరియు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజన్షిప్, వర్క్ పర్మిట్ గడువు ముగిసిన కార్మికులకు వైద్య పరీక్షల మినహాయింపును ప్రకటించింది.
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి యూ.ఏ.ఈ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కంపెనీలు,కార్మికుల వంటి సహాయక సేవా సిబ్బందికి పనిచేసే అనుమతులు మరియు రెసిడెన్స్ వీసాలు ఆటోమేటిక్ గా జారీ చేయబడతాయి మరియు పునరుద్ధరించబడతాయి.
కొత్త చర్యల ప్రకారం, కార్మికులు యూ.ఏ.ఈ దేశవ్యాప్తంగా వైద్య పరీక్షా కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం లేదు.అటువంటి సేవలకు ఫీజులు అధీకృత చెల్లింపు మార్గాల ద్వారా సేకరించబడతాయి.ఫీజు చెల్లించిన తర్వాత, కార్మికులు యూ.ఏ.ఈ యొక్క చట్టబద్ధమైన నివాసితులుగా ఉంటారు.
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజెన్షిప్ వ్యాపార యజమానులను తమ కార్మికులలో కోవిడ్ -19 యొక్క ఏదైనా అనుమానాస్పద కేసును నివేదించమని కోరింది. యూ.ఏ.ఈలోని కార్మికులందరూ తమ సొంత భద్రత కోసం మరియు సమాజ భద్రత కోసం ముందుజాగ్రత్త సూచనలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన