సౌదీ-కువైట్ సరిహద్దులో చిక్కకుపోయిన జనం..
- March 26, 2020
కువైట్:గల్ఫ్ దేశాల్లో కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించటంలో భాగంగా దేశ సరిహద్దులు మూసివేయటంతో కొందరు ప్రజలు బోర్డర్ దగ్గర చిక్కుకుపోయారు. కువైట్-సౌదీ సరిహద్దులోని జనంలో అలాంటి కష్టాలనే ఎదుర్కుంటున్నారు. డజన్ల కొద్ది కువైతీలు, వారి కుటుంబ సభ్యులు సరిహద్దు దగ్గర అనుమతి కోసం వేచి చూస్తున్నారు. తమను కువైట్ లోకి అనుమతించాలని కోరుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే సౌదీ నుంచి వచ్చే సరిహద్దును కువైట్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే..అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో తమను కువైట్ కు తిరిగి వచ్చేందుకు తగినంత సమయం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. తమను దేశంలోకి అనుమతించాలని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనస్ అల్ సలెహ్ కోరారు. తాము కుటుంబాలతో సహా సరిహద్దులో చిక్కుకుపోయామని..మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని తమ ఆవేదను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







