సౌదీ-కువైట్ సరిహద్దులో చిక్కకుపోయిన జనం..
- March 26, 2020
కువైట్:గల్ఫ్ దేశాల్లో కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించటంలో భాగంగా దేశ సరిహద్దులు మూసివేయటంతో కొందరు ప్రజలు బోర్డర్ దగ్గర చిక్కుకుపోయారు. కువైట్-సౌదీ సరిహద్దులోని జనంలో అలాంటి కష్టాలనే ఎదుర్కుంటున్నారు. డజన్ల కొద్ది కువైతీలు, వారి కుటుంబ సభ్యులు సరిహద్దు దగ్గర అనుమతి కోసం వేచి చూస్తున్నారు. తమను కువైట్ లోకి అనుమతించాలని కోరుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే సౌదీ నుంచి వచ్చే సరిహద్దును కువైట్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే..అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో తమను కువైట్ కు తిరిగి వచ్చేందుకు తగినంత సమయం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. తమను దేశంలోకి అనుమతించాలని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనస్ అల్ సలెహ్ కోరారు. తాము కుటుంబాలతో సహా సరిహద్దులో చిక్కుకుపోయామని..మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని తమ ఆవేదను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







