సౌదీ-కువైట్ సరిహద్దులో చిక్కకుపోయిన జనం..
- March 26, 2020కువైట్:గల్ఫ్ దేశాల్లో కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించటంలో భాగంగా దేశ సరిహద్దులు మూసివేయటంతో కొందరు ప్రజలు బోర్డర్ దగ్గర చిక్కుకుపోయారు. కువైట్-సౌదీ సరిహద్దులోని జనంలో అలాంటి కష్టాలనే ఎదుర్కుంటున్నారు. డజన్ల కొద్ది కువైతీలు, వారి కుటుంబ సభ్యులు సరిహద్దు దగ్గర అనుమతి కోసం వేచి చూస్తున్నారు. తమను కువైట్ లోకి అనుమతించాలని కోరుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే సౌదీ నుంచి వచ్చే సరిహద్దును కువైట్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే..అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో తమను కువైట్ కు తిరిగి వచ్చేందుకు తగినంత సమయం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. తమను దేశంలోకి అనుమతించాలని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనస్ అల్ సలెహ్ కోరారు. తాము కుటుంబాలతో సహా సరిహద్దులో చిక్కుకుపోయామని..మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని తమ ఆవేదను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ