సౌదీ-కువైట్ సరిహద్దులో చిక్కకుపోయిన జనం..
- March 26, 2020కువైట్:గల్ఫ్ దేశాల్లో కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించటంలో భాగంగా దేశ సరిహద్దులు మూసివేయటంతో కొందరు ప్రజలు బోర్డర్ దగ్గర చిక్కుకుపోయారు. కువైట్-సౌదీ సరిహద్దులోని జనంలో అలాంటి కష్టాలనే ఎదుర్కుంటున్నారు. డజన్ల కొద్ది కువైతీలు, వారి కుటుంబ సభ్యులు సరిహద్దు దగ్గర అనుమతి కోసం వేచి చూస్తున్నారు. తమను కువైట్ లోకి అనుమతించాలని కోరుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే సౌదీ నుంచి వచ్చే సరిహద్దును కువైట్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే..అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో తమను కువైట్ కు తిరిగి వచ్చేందుకు తగినంత సమయం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. తమను దేశంలోకి అనుమతించాలని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనస్ అల్ సలెహ్ కోరారు. తాము కుటుంబాలతో సహా సరిహద్దులో చిక్కుకుపోయామని..మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని తమ ఆవేదను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!