కర్ఫ్యూ ప్రపోజల్కి ఆమోదం
- March 26, 2020
బహ్రెయిన్:కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రతకు అడ్డుకట్ట వేసేందుకోసం పాక్షిక కర్ఫ్యూ విధించేందుకోసం బహ్రెయిన్ కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ఓ నిర్ణయాన్ని ఆమోదించింది. ప్రభుత్వం నుంచి ‘గో-ఎహెడ్’ నిర్ణయం కోసం ఈ ప్రపోజల్ ఎదురుచూస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, కింగ్డమ్లోని ప్రతి ఒక్కరూ రాత్రి 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తమ ఇళ్ళకే పరిమితం కావాల్సి వుంటుంది. దీనికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా వున్నాయి. ఇల్లీగల్ వర్కర్స్కి గ్రేస్ పీరియడ్ ఇచ్చి, తమ దేశానికి వెళ్ళిపోయేందుకు అనుమతించడం, కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు ఫండ్ ఏర్పాటు చేసి, నిధుల్ని, డొనేషన్లను ఆకర్షించడం, ఇంటి నుండి పని అమలు చేసేలా కంపెనీలకు దిశా నిర్దేశం చేయడం, కరోనా వైరస్పై పోరులో బాగంగా వాలంటీర్లకు ఇన్సెంటివ్ బోనస్ ఇవ్వడం, ఆర్థిక ప్యాకేజీని సంబంధిత ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటించడం, స్టూడెంట్స్ తరహాలో టీచర్లకు సెలవులు ప్రకటించడం వంటి ఆలోచనల్ని ఈ నిర్ణయంలో పొందుపరిచారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







