కర్ఫ్యూ ప్రపోజల్కి ఆమోదం
- March 26, 2020బహ్రెయిన్:కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రతకు అడ్డుకట్ట వేసేందుకోసం పాక్షిక కర్ఫ్యూ విధించేందుకోసం బహ్రెయిన్ కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ఓ నిర్ణయాన్ని ఆమోదించింది. ప్రభుత్వం నుంచి ‘గో-ఎహెడ్’ నిర్ణయం కోసం ఈ ప్రపోజల్ ఎదురుచూస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, కింగ్డమ్లోని ప్రతి ఒక్కరూ రాత్రి 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తమ ఇళ్ళకే పరిమితం కావాల్సి వుంటుంది. దీనికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా వున్నాయి. ఇల్లీగల్ వర్కర్స్కి గ్రేస్ పీరియడ్ ఇచ్చి, తమ దేశానికి వెళ్ళిపోయేందుకు అనుమతించడం, కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు ఫండ్ ఏర్పాటు చేసి, నిధుల్ని, డొనేషన్లను ఆకర్షించడం, ఇంటి నుండి పని అమలు చేసేలా కంపెనీలకు దిశా నిర్దేశం చేయడం, కరోనా వైరస్పై పోరులో బాగంగా వాలంటీర్లకు ఇన్సెంటివ్ బోనస్ ఇవ్వడం, ఆర్థిక ప్యాకేజీని సంబంధిత ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటించడం, స్టూడెంట్స్ తరహాలో టీచర్లకు సెలవులు ప్రకటించడం వంటి ఆలోచనల్ని ఈ నిర్ణయంలో పొందుపరిచారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!