యూ.ఏ.ఈ:వర్క్ పర్మిట్లు,రెసిడెన్స్ వీసాలు ఆటోమేటిక్ గా జారీ చేయబడతాయి
- March 26, 2020యూ.ఏ.ఈ:మానవ వనరులు & ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ మరియు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజన్షిప్, వర్క్ పర్మిట్ గడువు ముగిసిన కార్మికులకు వైద్య పరీక్షల మినహాయింపును ప్రకటించింది.
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి యూ.ఏ.ఈ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కంపెనీలు,కార్మికుల వంటి సహాయక సేవా సిబ్బందికి పనిచేసే అనుమతులు మరియు రెసిడెన్స్ వీసాలు ఆటోమేటిక్ గా జారీ చేయబడతాయి మరియు పునరుద్ధరించబడతాయి.
కొత్త చర్యల ప్రకారం, కార్మికులు యూ.ఏ.ఈ దేశవ్యాప్తంగా వైద్య పరీక్షా కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం లేదు.అటువంటి సేవలకు ఫీజులు అధీకృత చెల్లింపు మార్గాల ద్వారా సేకరించబడతాయి.ఫీజు చెల్లించిన తర్వాత, కార్మికులు యూ.ఏ.ఈ యొక్క చట్టబద్ధమైన నివాసితులుగా ఉంటారు.
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజెన్షిప్ వ్యాపార యజమానులను తమ కార్మికులలో కోవిడ్ -19 యొక్క ఏదైనా అనుమానాస్పద కేసును నివేదించమని కోరింది. యూ.ఏ.ఈలోని కార్మికులందరూ తమ సొంత భద్రత కోసం మరియు సమాజ భద్రత కోసం ముందుజాగ్రత్త సూచనలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన