రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నిర్మలా సీతారామన్
- March 26, 2020
ఢిల్లీ:కరోనా వలన కోట్లమంది జీవనోపాధిపై చావుదెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయాయి.భారత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొన్ని ఉద్దీపనలు ప్రకటిస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.తాజాగా ఆర్థిక మంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా లక్షా 70 వేల కోట్ల రూపాయల ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజిని ప్రకటించారు. రెండురోజుల క్రితమే ఆర్థికమంత్రి మీడియా భేటీ నిర్వహించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచారు. జూన్ 30, 2020 వరకూ ఈ గడువు పెంచారు. పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12 నుంచి 9 శాతానికి తగ్గించారు, ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు తుదిదశకు చేరిందన్నారు. జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సంబంధించి జూన్ 30 వరకూ గడువు విధించారు.పన్ను వివాదాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుము ఉండదన్నారు. ఆధార్, పాన్ కార్డు అనుసంధానం గడువును కూడా జూన్ 30 వరకూ పెంచారు.
ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఆర్థికమంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారని భావించారు. ఆ ప్రకటన తర్వాత రెండురోజులకు ఆర్థికమంత్రి స్పందించారు. తాజాగా లాక్ డౌన్ కారణంగా నష్టపోతుున్న చిన్న మరియు అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్థిక మంత్రి ప్యాకేజీలో ముఖ్యాంశాలు *గరీబ్ కళ్యాణ్ స్కీం కింద లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ*80 కోట్ల మందికి పీఎం అన్నా యోజన పథకం వర్తింపు*శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, నర్సులకు 15 లక్షల చొప్సున బీమా సదుపాయం. * ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తాం..ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం*పేదవాళ్లలో ఒక్కరూ కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం*రానున్న 3 నెలలకు ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం పంపిణీ*బియ్యం, గోధుమలో ఏదికావాలన్నా అందిస్తాం*ఇప్పటికే ఇస్తున్న 5 కేజీలను అదనంగా మరో 5 కేజీలు అందిస్తాం*కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తాం*రానున్న 3 నెలలకు కావాల్సిన రేషన్ను 2 వాయిదాల్లో తీసుకోవచ్చు*ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ*నగదు బదిలీ, ఆహార భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి* శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా*కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు*నగదు బదిలీ, ఆహార భద్రత ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి*ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ*శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా*ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున బీమా*కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు* ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







