ఆన్లైన్ ద్వారా వీసా రెన్యువల్.!
- March 26, 2020
మస్కట్: రెసిడెంట్ కార్డ్ హోల్డర్స్, తమ వీసాల్ని ఆన్లైన్లో రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా తమ తమ స్వదేశాల్లో చిక్కుకుపోయినవారికి ఈ సౌకర్యం అందుబాటులో వుంటుందని అధికారరలు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకోసం ఒమన్, నాన్ ఒమనీయులు దేశంలోకి రాకుండా బ్యాన్ చేశారు. రెసిడెంట్ కార్డ్ కలిగినవారికీ ఈ బ్యాన్ వర్తిస్తుంది. అన్ని రకాల వీసా కలిగినవారికీ ఒమన్లో ప్రవేశం లేదని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఒమన్లో ఇరుక్కుపోయినవారు, వెంటనే తమ తమ దేశాలకు వెళ్ళిపోవాలనీ, కొందరికి మాత్రం ఆన్లైన్ ద్వారా తమ వీసాల్ని పొడిగించుకునే అవకావం కల్పిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?