కువైట్ సిటీ: నిర్బంధంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన కువైతీస్..రిసార్ట్స్ శిబిరాల ఏర్పాటు
- March 26, 2020
విదేశాల నుంచి తిరిగి వచ్చిన 306 మంది కువైతీస్ ను 14 రోజుల నిర్బంధంలో పెట్టారు. వాళ్లందర్ని నిర్బంధంలో పెట్టేందుకు అల్ జోన్, సీషెల్ వంటి రిసార్ట్స్ లో ఏర్పాట్లు చేశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన కువైతీస్ ను విడతలు విడతలు గా ప్రత్యేక ఫ్లైట్లలో కువైతీ ప్రభుత్వం సొంత దేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. లెబనాన్, ఈజిప్ట్, బహ్రెయిన్ నుంచి ఇప్పటివరకు 306 మందిని బుధవారం కువైట్ కు తీసుకొచ్చారు. తొలి విడత తరలింపులో భాగంగా వచ్చే ఆదివారం వరకు విదేశాల్లోని కువైతీస్ ను తీసుకురానున్నారు. ఇవాళ (మార్చి 27)న సాయంత్రం 5 గంటలకు జర్మనీ నుంచి మరికొందరు కువైట్ చేరుకున్నారు. లండన్ నుంచి రాత్రి 8 గంటలకు మరికొందరు కువైట్ చేరుకుంటారు. ఇలా సొంత దేశానికి చేరుకుంటున్న కువైతీస్ అందరికీ ఎయిర్ పోర్టుల్లో పకడ్బందీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ సోకినట్లు అనుమానం వస్తే ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆస్పత్రికి తరలిస్తున్నారు. వైరస్ సోకకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఖచ్చితంగా నిర్బంధంలో పాటించేలా చర్యలు తీసుకుంటోంది. వాళ్లందరికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయితేనే నిర్బంధం నుంచి విడిచిపెట్టనున్నారు. ఇదిలాఉంటే గల్ఫ్ లో నివాసం ఉంటున్న 611 మంది విదేశీయులను ప్రత్యేక విమానాల్లో తమ సొంత దేశాలకు తరలిస్తున్నారు. 342 ఈజిప్టియన్లు, 254 ఫిలిపియన్లు, 15 మంది బహ్రెయినియన్లను తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్న తర్వాత వారి వారి దేశాలకు తరలించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







