జాతీయ గీతాలాపన ...స్పోర్ట్స్ హీరోస్..
- January 25, 2016
జాతీయ గీతాలాపన ఎప్పుడు చేసినా మనసు గర్వంతో ఉప్పొంగిపోతుందన్నాడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. ఆదివారమిక్కడ జరిగిన ది స్పోర్ట్స్ హీరోస్ ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో సచిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2011 ప్రపంచకప్ ఫైనల్ ప్రారంభానికి ముందు కిక్కిరిసిన వాంఖడే స్టేడియం మధ్యలో నిలబడి జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు కలిగిన అనుభూతి ఎప్పటికీ మరువలేనిదని చెప్పాడు. అందరూ కలిసి జాతీయ గీతాలాపన చేస్తే ఆ అనుభూతి మరో స్థాయికి చేరుతుంది. ఇలాంటి అనుభావాలు నాకు రెండు ఉన్నాయి. 2003 ప్రపంచకప్లో పాకిస్థాన్తో సెంచూరియన్ స్టేడియంలో జరిగిన వన్డేలో 60 వేల మంది కలిసి జన గణ మన అంటూ పాడిన సందర్భం ఒకటైతే, మరొకటి 2011 ప్రపంచకప్ ఫైనల్లో.ఆ రెండు సందర్భాల్లో నాకు కలిగిన అనుభూతి నేను మునుపెన్నడూ అనుభవించనిది. వ్యక్తిగతంగా ఎన్ని విజయాలు సాధించినా, జాతీయ గీతాలపనతో కలిగే ఆ అనుభూతికి సరిరావు అని సచిన్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







