దుబాయ్ : వినియోగదారులకు ఊరట..మార్కెట్లో దోపిడిపై ఫిర్యాదుకు హెల్ప్ లైన్
- March 29, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో పండ్లు, కూరగాయల ధరల నియంత్రణకు దుబాయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఎవరైనా ధరలు పెంచి అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఏ స్టోర్ లో అయినా పండ్లు, కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మితే 600545555 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు. లేదంటే దుబాయ్ కన్సూమర్ (Dubai Consumer) పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతులు నెమ్మదించటంతో ఇదే అదనుగా వర్తకులు దోపిడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు పెరిగిన ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ధరల నియంత్రణకు వినియోగదారుల ప్రయోజనం దృష్ట్యా ప్రస్తుత హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







