దుబాయ్ : వినియోగదారులకు ఊరట..మార్కెట్లో దోపిడిపై ఫిర్యాదుకు హెల్ప్ లైన్
- March 29, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో పండ్లు, కూరగాయల ధరల నియంత్రణకు దుబాయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఎవరైనా ధరలు పెంచి అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఏ స్టోర్ లో అయినా పండ్లు, కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మితే 600545555 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు. లేదంటే దుబాయ్ కన్సూమర్ (Dubai Consumer) పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతులు నెమ్మదించటంతో ఇదే అదనుగా వర్తకులు దోపిడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు పెరిగిన ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ధరల నియంత్రణకు వినియోగదారుల ప్రయోజనం దృష్ట్యా ప్రస్తుత హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..