దుబాయ్ : వినియోగదారులకు ఊరట..మార్కెట్లో దోపిడిపై ఫిర్యాదుకు హెల్ప్ లైన్
- March 29, 2020కరోనా వైరస్ నేపథ్యంలో పండ్లు, కూరగాయల ధరల నియంత్రణకు దుబాయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఎవరైనా ధరలు పెంచి అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఏ స్టోర్ లో అయినా పండ్లు, కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మితే 600545555 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు. లేదంటే దుబాయ్ కన్సూమర్ (Dubai Consumer) పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతులు నెమ్మదించటంతో ఇదే అదనుగా వర్తకులు దోపిడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు పెరిగిన ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ధరల నియంత్రణకు వినియోగదారుల ప్రయోజనం దృష్ట్యా ప్రస్తుత హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్