COVID-19/దుబాయ్: ఆస్తిని విరాళంగా ఇచ్చిన భారతీయ వ్యాపారవేత్త
- March 29, 2020దుబాయ్: COVID-19 ను ఎదుర్కోవటానికి యూఏఈ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫింజా జ్యువెలరీ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ అజయ్ శోబ్రజ్ F ఫిన్జా తన ఉదారత్వాన్ని నిరూపించారు.
25 సంవత్సరాలుగా దుబాయ్ లో నివసిస్తున్న ఫింజా, 'జుమేరా లేక్ టవర్స్'లోని తన భవనాన్ని విరాళంగా ఇచ్చారు. కరోనా కు వ్యతిరేకంగా పోరాడుతున్న యూఏఈ ప్రభుత్వానికి బాధిత రోగులను నిర్బంధించడం కోసం ఈ భవనాన్ని ఇస్తున్నాను అంటూ 'టు సపోర్ట్ అండ్ గివ్ బ్యాక్ దట్ కేర్స్' అనే శీర్షికతో దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) కు లేఖ రాశారు ఫింజా.
77,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 400 మందికి వసతి అందించగల ఈ భవనం అవసరమైన అన్ని ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా డీప్ క్లీనింగ్, శానిటైజేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సర్వీసింగ్ సహా అన్ని అవసరమైన సర్వీసింగులు చేయించి సిద్ధంగా ఉంది అని అధికారులు తెలిపారు.
అజయ్ శోబ్రజ్ F ఫిన్జా ఇలా అన్నారు: “ఇలాంటి సవాలు సమయాల్లో, ఈ మహమ్మారిని అధిగమించడానికి సమాజం కలిసి రావడం మరియు మనం నివసించే దేశానికి మద్దతు ఇవ్వడం అత్యవసరం. ఈ క్లిష్టమైన కాలంలో ప్రభుత్వానికి నా సహాయాన్ని అందించడం మరియు గత 25 సంవత్సరాలుగా నా విజయానికి మరియు వృద్ధికి తోడ్పడుతున్న నగరానికి మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.”
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం