కువైట్: భారతీయునికి కరోనా పాజిటివ్!!
- March 29, 2020
కువైట్: మహబౌలా ప్రాంతంలోని ఒక లేబర్ క్యాంపు లో బస చేస్తున్న భారతీయునికి కరోనా సోకింది. ఈ సంగతి తెలుసుకున్న ఆరోగ్య శాఖ, వెనువెంటనే ఆ క్యాంపు లో నివసిస్తున్న 600 మంది కార్మికులను నిర్బంధించింది. పేరున్న ఇంజనీరింగ్ సంస్థకు చెందిన కార్మికులను కలిగి ఉన్న ఈ శిబిరం ఇకపై కార్మికులను సైట్లకు పంపకుండా వీరందరికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.
గత వారం ఫర్వానియా భవనం లో నివసిస్తున్న వ్యక్తికి కరోనావైరస్ సోకగా ఆ భవనంలో ఉంటున్న 250 మంది ప్రవాసీయులను గృహ నిర్బంధం చేసింది కువైట్ ఆరోగ్య శాఖ. భవనం చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసి, నిరంతరం పాట్రోలింగ్ చేస్తూ 14 రోజుల తప్పనిసరి నిర్బంధ కాలాన్ని కఠినతరం చేసింది. ప్రస్తుతం, వైద్య బృందం తప్ప ఎవరికీ భవనం లోపలి ప్రవేశించడానికి లేదా నిష్క్రమించడానికి అనుమతి లేదు.
భోజన సదుపాయాలు:
భవనంలో నివసిస్తున్న వారంతా ఒకే కంపెనీ కి చెందివారే, అందరు తమ కంపెనీ ఇస్తున్న వసతి సదుపాయంతో నివసిస్తున్నవారే కావటం విశేషం. వీరందరికి మూడు పూటలా భోజన వసతులు అందిస్తోంది వీరి కంపెనీ యాజమాన్యం.
నిత్యావసరాల మాటేంటి?
దిగ్బంధంలో ఉన్నవారు ఇంటి డెలివరీ ద్వారా కిరాణా లేదా ఇతర నిత్యావసరాలు బయట నుండి ఆర్డర్ చేసుకుంటే, కాపలా కాస్తున్న అధికారులకు నివేదించవచ్చు. ఆర్డర్ చేసిన వస్తువులు భవనానికి చేరుకున్నప్పుడు, ప్యాకేజీని ఒక గార్డు తీసుకొని దానిని కోరిన వ్యక్తికి అందజేయడానికి బయట ఉంచబడుతుంది.
వ్యర్ధాలు సంగతేంటి?
భవన వ్యర్థాల విషయానికొస్తే, సాధారణముగా పాటించే పద్ధతికంటే భిన్నంగా నిర్వహించబడుతుంది, ఎందుకంటే ఇది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి కరోనావైరస్-నివారణ ప్రోటోకాల్లకు లోబడి ఉంటుంది. వ్యర్థాలను సేకరించడానికి దిగ్బంధం ప్రాంతం సమీపంలో అనేక కంటైనర్లు ఉంచారు. కంటైనర్లను ఖాళీ చేయడానికి మరియు దాని వ్యర్థాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం తీసుకోవడానికి ప్రతిరోజూ ఒక క్లీనర్ను నియమించారు.
---దివాకర్, మాగల్ఫ్ ప్రతినిధి, కువైట్
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







