కరోనా ఎఫెక్ట్:రోగుల కోసం రక్త దానం చేయాలని ఒమన్ ప్రభుత్వం పిలుపు
- March 29, 2020
కరోనా కారణంగా రోగులకు చికిత్స ఆగిపోకుండా ఒమన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుంది. రోగుల కోసం ప్రజలు రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ సేవల విభాగం అధికారులు పిలుపునిచ్చారు. రక్త దానం చేయాలనుకునేవారు బవ్షర్ బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో రక్తం ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అలాగే గవర్నరేట్ పరిధిలోని స్థానిక బ్లడ్ బ్యాంక్ కేంద్రాల్లో కూడా రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రక్త దానం చేయాలనుకునే వారు 94555648కి ఫోన్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఇతర రోగులకు చికిత్స ఆగిపోకుండా ఉండేందుకు ఈ చర్యలను చేపట్టారు. అయితే..వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రక్త దాన శిబిరాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా డీబీబీఎస్ అధికారులు చెప్పారు. పరిమిత సంఖ్యలోనే రక్త దానం చేసేవారిని శిబిరాలకు అనుమతిస్తారు. ముందస్తుగా బుక్ చేసుకున్న టైం స్లాట్స్ ప్రకారం అనుమతిస్తారు. అంతేకాదు..కోవిడ్ ప్రభావిత ప్రాంతాల వారు, వైరస్ సోకిన పేషెంట్లతో కాంటాక్ట్ అయిన వారి విషయంలో కొన్ని షరతులు విధించారు. బ్లడ్ డొనేట్ చేసే సమయానికి 28 రోజులు గడిచి ఉంటేనే వారి నుంచి రక్తం సేకరిస్తారు. అలాగే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు కోలుకున్న మూడు నెలల తర్వాతే రక్త దానం చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!







