భారత్ లో స్టేటస్ వీడియోలు ఇక 15 సెకండ్లే
- March 30, 2020
ప్రముఖ సోషల్మీడియా మెసెంజింగ్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ స్టేటస్లో పెట్టుకొనే వీడియోలు ఇక నుంచి 15 సెకండ్లకు మించి నిడివి ఉండరాదని సూచించింది. ఇప్పటివరకు ౩౦ సెకండ్ల వరకు ఉన్న వీడియోల నిడివిని తాజాగా 15 సెకండ్లకు తగ్గించాలని నిర్ణయించినట్లు వాబెటాఇన్ఫో ట్వీట్ చేసింది. కరోనా నేపథ్యంలో యూజర్లు కుప్పలుతెప్పలుగా వీడియోలను స్టేటస్లు పెట్టుకుంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 15 సెకండ్లకు మించి నిడివి ఉన్న వీడియోలు స్టేటస్లో ఇకనుంచి అప్లోడ్ కావు. వాట్సాప్లో పెరిగిపోయిన ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ మొదలైనప్పడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్నాకొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్లో వాట్సాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







