భారత్ లో స్టేటస్ వీడియోలు ఇక 15 సెకండ్లే
- March 30, 2020
ప్రముఖ సోషల్మీడియా మెసెంజింగ్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ స్టేటస్లో పెట్టుకొనే వీడియోలు ఇక నుంచి 15 సెకండ్లకు మించి నిడివి ఉండరాదని సూచించింది. ఇప్పటివరకు ౩౦ సెకండ్ల వరకు ఉన్న వీడియోల నిడివిని తాజాగా 15 సెకండ్లకు తగ్గించాలని నిర్ణయించినట్లు వాబెటాఇన్ఫో ట్వీట్ చేసింది. కరోనా నేపథ్యంలో యూజర్లు కుప్పలుతెప్పలుగా వీడియోలను స్టేటస్లు పెట్టుకుంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 15 సెకండ్లకు మించి నిడివి ఉన్న వీడియోలు స్టేటస్లో ఇకనుంచి అప్లోడ్ కావు. వాట్సాప్లో పెరిగిపోయిన ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ మొదలైనప్పడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్నాకొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్లో వాట్సాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







