భారత్ లో స్టేటస్ వీడియోలు ఇక 15 సెకండ్లే
- March 30, 2020
ప్రముఖ సోషల్మీడియా మెసెంజింగ్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ స్టేటస్లో పెట్టుకొనే వీడియోలు ఇక నుంచి 15 సెకండ్లకు మించి నిడివి ఉండరాదని సూచించింది. ఇప్పటివరకు ౩౦ సెకండ్ల వరకు ఉన్న వీడియోల నిడివిని తాజాగా 15 సెకండ్లకు తగ్గించాలని నిర్ణయించినట్లు వాబెటాఇన్ఫో ట్వీట్ చేసింది. కరోనా నేపథ్యంలో యూజర్లు కుప్పలుతెప్పలుగా వీడియోలను స్టేటస్లు పెట్టుకుంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 15 సెకండ్లకు మించి నిడివి ఉన్న వీడియోలు స్టేటస్లో ఇకనుంచి అప్లోడ్ కావు. వాట్సాప్లో పెరిగిపోయిన ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ మొదలైనప్పడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్నాకొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్లో వాట్సాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..