సైన్యానికి ఆ బాధ్యత అప్పగించిన స్పెయిన్...
- March 30, 2020కరోనా వలన యూరప్ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చైనా తరువాత యూరప్ లోకి ప్రవేశించిన కరోనా అక్కడి నుంచి విలయతాండవం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్ దేశాలలో వైరస్ బారిన పడుతున్న వ్యక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. వైరస్ నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడ చాలా వరకు కట్టడి అయ్యింది. యూరప్, అమెరికా దేశాల్లో మాత్రం అదుపు చేయలేకపోతున్నారు.
స్పెయిన్ లో చేయి దాటిపోవడంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ విధించడంతో పాటుగా ప్రజలను కంట్రోల్ చేసే బాధ్యతను ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది. అంతేకాదు, దీనికి సంబంధించి విశేషాధికారాలు సైన్యానికి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఆ దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైరస్ ను కట్టడి చేయడానికి స్పెయిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున స్పెయిన్ లో ఏకంగా 6300 మంది కరోనా బారిన పడ్డారు. సామాజిక దూరం పాటించకుంటే మరింత దేశం మరింత తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్