క్వారంటీన్‌ సెంటర్‌ నుంచి ఇంటికి చేరుకున్న 300 మంది సిటిజన్స్‌

- March 30, 2020 , by Maagulf
క్వారంటీన్‌ సెంటర్‌ నుంచి ఇంటికి చేరుకున్న 300 మంది సిటిజన్స్‌

జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, 300 మంది సిటిజన్స్‌ క్వారంటీన్‌ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్ళినట్లు వెల్లడించింది. అలా వెళ్ళినవారికి గులాబీలు, బహుమతులు ఇచ్చారు అధికారులు. 14 రోజులపాటు వీరందరినీ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో క్వారంటీన్‌ కోసం వుంచారు. కరోనా వైరస్‌ని అరికట్టే క్రమంలో అనుమానితుల్ని క్వారంటీన్‌కి పంపుతున్న విషయం విదితమే. చైనా, ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌, జరమనీ, ఇరాన్‌, ఇటలీ, జపాన్‌, సౌత్‌ కొరియా మరియు స్పెయిన్‌ నుంచి వచ్చినవారిని క్వారంటీన్‌ సెంటర్లకు తరలించారు. కొందరిని ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేకంగా వైద్య పర్యవేక్షణలో వుంచారు. కరోనా వైరస్‌ లక్షణాలు లేనివారిని సైతం క్వారంటీన్‌లో వుంచడం జరిగింది. క్వారంటీన్‌ గడువు ముగిశాక వారిని తమ తమ ఇళ్ళకు పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com