క్వారంటీన్ సెంటర్ నుంచి ఇంటికి చేరుకున్న 300 మంది సిటిజన్స్
- March 30, 2020జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 300 మంది సిటిజన్స్ క్వారంటీన్ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్ళినట్లు వెల్లడించింది. అలా వెళ్ళినవారికి గులాబీలు, బహుమతులు ఇచ్చారు అధికారులు. 14 రోజులపాటు వీరందరినీ ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటీన్ కోసం వుంచారు. కరోనా వైరస్ని అరికట్టే క్రమంలో అనుమానితుల్ని క్వారంటీన్కి పంపుతున్న విషయం విదితమే. చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జరమనీ, ఇరాన్, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా మరియు స్పెయిన్ నుంచి వచ్చినవారిని క్వారంటీన్ సెంటర్లకు తరలించారు. కొందరిని ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేకంగా వైద్య పర్యవేక్షణలో వుంచారు. కరోనా వైరస్ లక్షణాలు లేనివారిని సైతం క్వారంటీన్లో వుంచడం జరిగింది. క్వారంటీన్ గడువు ముగిశాక వారిని తమ తమ ఇళ్ళకు పంపించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ