కరోనా ఔషధాలతో జపాన్ వెళుతూ కుప్పకూలిన విమానం...
- March 30, 2020కరోనా వైరస్ బాధితులకు అవసరమైన ఔషధాలు, మెడికల్ ఎక్విప్ మెంట్ తో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నుంచి జపాన్ కు బయలుదేరిన విమానం టేకాఫ్ అవుతూనే కుప్పకూలగా, విమానంలోని 8 మంది మరణించారు. టేకాఫ్ సమయంలోనే విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడి, రన్ వేపైనే విమానం కూలి మంటలు చెలరేగాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించినా, ఒక్కరి ప్రాణాలు కూడా కాపాడలేకపోయారు.
గత మూడు వారాలుగా జపాన్ లో కరోనా వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో వైద్య పరికరాలతో ఈ విమానం హనెడాకు బయలుదేరింది. రన్ వేపైనే విమానం కాలిపోవడంతో, మనీలా నుంచి బయలుదేరాల్సిన ఇతర విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ విమానం ప్రభుత్వానిది కాదని, లయన్ ఎయిర్ అనే చార్టెడ్ కంపెనీదని అధికారులు వెల్లడించారు. జరిగిన ప్రమాదంపై విచారణ జరిపిస్తున్నట్టు పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై జపాన్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం