చైనా లో భారీ అగ్నిప్రమాదం..19 మంది మృతి
- March 31, 2020చైనా: నైరుతి చైనాలో భారీ అటవీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మాటలతో పోరాడుతుండగా పద్దెనిమిది అగ్నిమాపక సిబ్బంది మరియు ఒక అటవీ గైడ్ మరణించారు. సిచువాన్ ప్రావిన్స్లోని జిచాంగ్ నగరానికి దగ్గరగా ఉన్న పర్వతాల నుండి ఆకాశంలోకి పెద్దగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆకాశం ఎర్రగా మారటం ప్రజలు గమనించారు. 700,000 మంది జనాభా ఉన్న ఈ నగర భవనాలు మరియు రహదారులపై భారీ పొగ మేఘాలు అలుముకున్నాయి. మంటలను అరికట్టడానికి 140 కి పైగా ఫైర్ ఇంజన్లు, నాలుగు హెలికాప్టర్లు మరియు దాదాపు 900 అగ్నిమాపక సిబ్బందిని పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మొత్తం రెండువేల మందికి పైగా అత్యవసర కార్మికులు మంటలను అరికట్టడానికి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు మరియు 1,200 మందికి పైగా స్థానిక ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలించారు.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు