చైనా లో భారీ అగ్నిప్రమాదం..19 మంది మృతి
- March 31, 2020చైనా: నైరుతి చైనాలో భారీ అటవీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మాటలతో పోరాడుతుండగా పద్దెనిమిది అగ్నిమాపక సిబ్బంది మరియు ఒక అటవీ గైడ్ మరణించారు. సిచువాన్ ప్రావిన్స్లోని జిచాంగ్ నగరానికి దగ్గరగా ఉన్న పర్వతాల నుండి ఆకాశంలోకి పెద్దగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆకాశం ఎర్రగా మారటం ప్రజలు గమనించారు. 700,000 మంది జనాభా ఉన్న ఈ నగర భవనాలు మరియు రహదారులపై భారీ పొగ మేఘాలు అలుముకున్నాయి. మంటలను అరికట్టడానికి 140 కి పైగా ఫైర్ ఇంజన్లు, నాలుగు హెలికాప్టర్లు మరియు దాదాపు 900 అగ్నిమాపక సిబ్బందిని పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మొత్తం రెండువేల మందికి పైగా అత్యవసర కార్మికులు మంటలను అరికట్టడానికి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు మరియు 1,200 మందికి పైగా స్థానిక ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు