కోవిడ్ 19: ఫ్యాక్టరీ వర్కర్స్కి సేఫ్టీ గైడ్లైన్స్
- March 31, 2020మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కోవిడ్19 (కరోనా వైరస్) నేపథ్యంలో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించి ఫ్యాక్టరీ వర్కర్స్కి స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ రిమోట్ పద్ధతిలో పనిచేయాల్సి వుంటుంది. అకౌంటెంట్స్ మరియు కో-ఆర్డినేటర్స్కీ ఇదే పద్ధతి అమలు చేయాలి. వారి కార్యాలయాల్ని ఎంప్లాయీస్ క్వార్టర్స్గా మార్చాలి. ఫ్యాక్టరీ పరిసరాల్లో వుండాల్సిన అవసరం వున్న కార్మికులు, కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేవరకూ అక్కడే వుండేలా ఏర్పాట్లు చేయాల్సి వుంటుంది. వర్కర్స్కి సంబంధించిన పేర్లు, ఫోన్ నెంబర్స్ సంబంధిత అధికార వర్గాలకు అందించాలి. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ప్రయాణించే ట్రక్ డైవర్స్ వివరాలు పొందు పర్చాల్సి వుంటుంది. ప్రొటెక్టివ్ క్లాతింగ్, మాస్క్ అలాగే గ్లోవ్స్ని డ్రైవర్లు ధరించక తప్పదు. ఇండస్ట్రియల్ ఏరియా లేదా ఫ్రీ జోన్లోకి ట్రక్ ఎంటరయ్యాక దాన్ని డ్రైవర్ విడిచి వుండకూడదు. స్పెషలైజ్డ్ పస్రనల్, లోడింగ్ అలాగే అన్లోడింగ్ ప్రక్రియలు చేపడతారు. వీరికీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తప్పదు. ఈ తరహా గైడ్ లైన్స్ని విడుదల చేసిన మినిస్ట్రీ, ప్రతి ఒక్కరూ తప్పక వీటిని పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..