కోవిడ్ 19: ఫ్యాక్టరీ వర్కర్స్కి సేఫ్టీ గైడ్లైన్స్
- March 31, 2020
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కోవిడ్19 (కరోనా వైరస్) నేపథ్యంలో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించి ఫ్యాక్టరీ వర్కర్స్కి స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ రిమోట్ పద్ధతిలో పనిచేయాల్సి వుంటుంది. అకౌంటెంట్స్ మరియు కో-ఆర్డినేటర్స్కీ ఇదే పద్ధతి అమలు చేయాలి. వారి కార్యాలయాల్ని ఎంప్లాయీస్ క్వార్టర్స్గా మార్చాలి. ఫ్యాక్టరీ పరిసరాల్లో వుండాల్సిన అవసరం వున్న కార్మికులు, కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేవరకూ అక్కడే వుండేలా ఏర్పాట్లు చేయాల్సి వుంటుంది. వర్కర్స్కి సంబంధించిన పేర్లు, ఫోన్ నెంబర్స్ సంబంధిత అధికార వర్గాలకు అందించాలి. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ప్రయాణించే ట్రక్ డైవర్స్ వివరాలు పొందు పర్చాల్సి వుంటుంది. ప్రొటెక్టివ్ క్లాతింగ్, మాస్క్ అలాగే గ్లోవ్స్ని డ్రైవర్లు ధరించక తప్పదు. ఇండస్ట్రియల్ ఏరియా లేదా ఫ్రీ జోన్లోకి ట్రక్ ఎంటరయ్యాక దాన్ని డ్రైవర్ విడిచి వుండకూడదు. స్పెషలైజ్డ్ పస్రనల్, లోడింగ్ అలాగే అన్లోడింగ్ ప్రక్రియలు చేపడతారు. వీరికీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తప్పదు. ఈ తరహా గైడ్ లైన్స్ని విడుదల చేసిన మినిస్ట్రీ, ప్రతి ఒక్కరూ తప్పక వీటిని పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?