అబుధాబి: కార్మికుల నిర్బంధానికి అత్యున్నత ప్రమాణాలతో వసతి ఏర్పాటు
- March 31, 2020అబుధాబి:కరోనాపై పోరాటంలో భాగంగా అబుధాబి అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.ఇటీవలె విదేశాల నుంచి ప్రయాణం చేసి అబుధాబి చేరుకున్న వారి కోసం అత్యున్నత ప్రమాణాలతో నిర్బంధ ఏర్పాట్లను చేసింది. జోన్ కార్ప్ ఈ నిర్బంధ శిబిరాలను పర్యవేక్షిస్తోంది. 30 మంది కార్మికులకు ఒక శిబిరం చొప్పున మొత్తం 4,20,000 మంది కార్మికులు ఉండేలా రెసిడెన్షియల్ సిటీస్ ను సిద్ధం చేశారు. అంతేకాదు..కార్మికులు ప్రయాణించిన బస్సులను ఎప్పటికప్పుడు రసాయనాలతో (శానిటైజ్) శుభ్రపరుస్తున్నారు. కార్మికులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ధిక మండళ్లలోని పరిశ్రమలు, కంపెనీలలో పనిచేసే కార్మికుల శ్రేయస్సుకు తాము అధిక ప్రధాన్యం ఇస్తున్నామని జోన్స్ కార్ప్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అల్ ఖదర్ అల్ అహ్మద్ అన్నారు. నిర్బంధ శిబిరాల్లో ఖచ్చితమైన ప్రమాణాలను పాటించినట్లు వెల్లడించారు. కరోనా ప్రభావంతో పారిశ్రామిక రంగం సమస్యలు ఎదుర్కొకుండా, పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా తాము తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి