కరోనా ఎఫెక్ట్:అబుధాబిలో సరుకుల రవాణాకు ఉచిత ట్యాక్సీ..రిటైలర్లకు ఊరట
- April 01, 2020
అబుధాబి మున్సిపాలిటీ రిటైల్ షాపు ఓనర్లకు ఊరటనిచ్చేలా ఉచిత ట్యాక్సీలు అందిస్తోంది. ఆన్ లైన్ ఆర్డర్స్ మేరకు రిటైలర్స్ తమ సరుకులను మున్సిపాలిటీ ట్యాక్సీల ద్వారా ఇక నుంచి ఉచితంగా హోమ్ డెలివరీ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. 600535353 ద్వారా రిజిస్టర్ చేసుకున్న రిటైలర్లు ట్యాక్సీ యాప్ ద్వారా అబుధాబి మున్సిపాలిటీ సమకూర్చే వాహనాలను వాడుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా...తాము అందిస్తున్న ట్యాక్సీ డ్రైవర్స్ కి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని కూడా చెప్పారు. వినియోగదారులకు సరుకులు సరఫరా చేసే సమయంలో డ్రైవర్లు విధిగా మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు ధరించటంతో పాటు ఇత శానిటైజ్ విధానాలను కూడా పాటించేలా శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇటీవల ఆన్ లైన్ ఆర్డర్స్ విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసింది. దీంతో వినియోగదారులు అందరికీ తమ సొంత వాహనాల్లో సరుకుల రవాణా చేయటంలో రిటైలర్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పైగా సరుకుల సరఫరా ఆలస్యంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అబుదాబి మున్సిపాలిటీ రవాణా విభాగం ఉచితంగా ట్యాక్సీలను అందిస్తోంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







