ఏపీలో కరోనా కలకలం..
- April 01, 2020
ఏపీ:ఏపీలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా రాష్ట్రము అలెర్ట్ అయ్యింది. కాగా 14 మంది బాధితుల్లో ఏలూరులో 8 మంది, భీమవరంలో రెండు ఇద్దరు, ఉండి , గుండుగోలను, నారాయణపురం, పెనుగొండల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా భారిన పడ్డారు. వీరంతా ఢిల్లీ లోని జమైతా ఇస్లామిక్ సభలకు వెళ్లి వచ్చిన వారే కావడం విశేషం. అయితే వీరిలో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. ఢిల్లీ వెళ్లి వచ్చారనే అనుమానంతో పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఘటనతో పశ్చిమ గోదావరిలో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా అధికారులు వారి బంధువులను ఇప్పటికే ఐసోలేషన్ కు తరలించారు. వారు ఎవరెవరిని కలిశారు అని వెతికే పనిలో అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







