ఏపీలో కరోనా కలకలం..
- April 01, 2020
ఏపీ:ఏపీలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా రాష్ట్రము అలెర్ట్ అయ్యింది. కాగా 14 మంది బాధితుల్లో ఏలూరులో 8 మంది, భీమవరంలో రెండు ఇద్దరు, ఉండి , గుండుగోలను, నారాయణపురం, పెనుగొండల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా భారిన పడ్డారు. వీరంతా ఢిల్లీ లోని జమైతా ఇస్లామిక్ సభలకు వెళ్లి వచ్చిన వారే కావడం విశేషం. అయితే వీరిలో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. ఢిల్లీ వెళ్లి వచ్చారనే అనుమానంతో పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఘటనతో పశ్చిమ గోదావరిలో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా అధికారులు వారి బంధువులను ఇప్పటికే ఐసోలేషన్ కు తరలించారు. వారు ఎవరెవరిని కలిశారు అని వెతికే పనిలో అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







