అమెరికా లో ఊహించని స్థాయిలో మరణాలు..
- April 01, 2020
అమెరికా:కరోనా మహమ్మారి దాటికి ప్రపంచం అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ను మాత్రం ఈ వైరస్ చావు దెబ్బ తీస్తుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లో అధ్యక్షుడు ట్రంప్ విఫలం కావడంతో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఇప్పటివరకు అక్కడ 2లక్షల కరోనా కేసులు నమోదైయ్యాయంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. నిన్న ఒక్క రోజే 25000 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా వల్ల తీవ్రంగా మాస్క్ ల కొరత ఏర్పడింది.
దాంతో మాస్క్ లు లేకపోతే కర్చీఫ్ లు కట్టుకోవాలని ట్రంప్ సూచించాడు అంతేకాదు అమెరికా కు ఇది జీవన్మరణ సమస్య అని ప్రజలు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నాడు. మొత్తంగా యూఎస్ఏ లో100,000 - 240,000 మంది కరోనా వల్ల చనిపోతారని ట్రంప్ మెడికల్ అడ్వైసరి అంచనా వేసింది. ఇప్పటివరకు అమెరికా లో కరోనా వల్ల 4000 మరణాలు సంభవించాయి. దాంతో కరోనా మరణాల్లో చైనా ను వెనక్కునెట్టిసింది అమెరికా. కరోనా విషయం లో అక్కడి ప్రభుత్వం ఉదాసీనత గా వ్యవహరించడంతో ఇప్పుడు ఊహకందని నష్టం చేస్తుంది.
ఇదిలావుంటే స్పెయిన్ ,ఇటలీ ,ఫ్రాన్స్ లో కూడా కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 850,000 కేసులు నమోదు కాగా ఇందులో 41,000 మంది మరణించారు..176,000మంది బాధితులు కోలుకుంటున్నట్లు రిపోర్ట్స్ వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







