ఒమన్‌లో గవర్నరేట్స్‌ మధ్య కదలికల పై ఆంక్షలు

- April 01, 2020 , by Maagulf
ఒమన్‌లో గవర్నరేట్స్‌ మధ్య కదలికల పై ఆంక్షలు

మస్కట్‌: ఏప్రిల్‌ 1 నుంచి రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అలాగే సుల్తాన్స్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ చెక్‌ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అన్ని గవర్నరేట్స్‌లోనూ పౌరులు, నివాసితుల కదలికల్ని మానిటర్‌ చేయనున్నారు. గవర్నరేట్స్‌ మధ్య కదలికలపై ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సివిల్‌ ఐడీ మరియు వర్క్‌ కార్డుల్ని రెసిడెంట్స్‌ అలాగే పౌరులు తమ వెంట వుంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్‌, ఎమర్జన్సీ వెహికిల్స్‌,  మిలిటరీ మరియు సెక్యూరిటీ వాహనాలు, ఫుడ్‌ స్టఫ్‌ అలాగే బేసిక్‌ నీడ్స్‌ని తరలించే వాహనాలు, కన్‌స్ట్రక్షన్‌ అలాగే కమర్షియల్‌ మెటీరియల్స్‌ని తరలించే వాహనాలు వంటి వాటికి ఈ ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించారు.

--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com