దుబాయ్:కరోనాతో వ్యక్తి చనిపోయినట్లు పుకార్లు..వాస్తవాలను వెలుగోకి తెచ్చిన CDA
- April 01, 2020
దుబాయ్:కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి దుష్ప్రచారం చేసినా సహించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నా..ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు. దుబాయ్ లోనూ అలాంటి అసత్య ప్రచారమే ఈ మధ్య వైరల్ గా మారింది. కరోనా వైరస్ తో దుబాయ్ వీధిలో ఓ వ్యక్తి చనిపోయినట్లు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ అధారిటీ వాస్తవాలను వెలుగులోకి వెలుగులోకి తీసుకొచ్చింది. దుబాయ్ వీధిలో పడిన వ్యక్తి కరోనా వైరస్ చనిపోయిన వ్యక్తి వీడియో కాదని తేల్చేసింది. అతను మూర్చవ్యాధితో బాధపడుతున్నాడని, మూర్ఛరావటంతోనే అతను కిందపడిపోయినట్లు అసలు విషయాన్ని ప్రజలకు వివరించింది. కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి అవాస్తవాలను ప్రచారం చేసిన తాము గమనిస్తూనే ఉంటామని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఫోన్ కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియాపై నిరంతరం తమ నిఘా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. సమాజ భద్రతకు హని కలిగించేలా చేసే అసత్య ప్రచారాలు యూఏఈ చట్ట ప్రకారం నేరమని, అలాంటి పుకార్లను వ్యాప్తి చేసే వారు జైలు శిక్షతో పాటు 3 మిలియన్ డాలర్ల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..