రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియోకాన్ఫరెన్స్
- April 01, 2020భారత దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. ఇంతలో మర్కజ్ నిజాముద్దీన్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లోని తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారి కారణంగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశంలోని అనేకరాష్ట్రాలతో పాటుగా విదేశాలనుంచి వచ్చినవారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడిచిన 48గంటల్లోనే వివిధరాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 138మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది.
ఈ నేపథ్యంలో గురువారం(ఏప్రిల్-1,2020) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసులు, సంభవించిన మరణాలు, కరోనా నివారణకు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు మొదలైన వాటిపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
ముఖ్యంగా మర్కజ్ నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొన్న వారు ఏయే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ఎంత మందికి కరోనా పాజిటివ్గా తేలింది? వారిపై పర్యవేక్షణ ఎలా ఉంది? అనే అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. మరోవైపు లాక్డౌన్ అమలు తీరుపై కూడా ఈ భేటీలో చర్చ జరుగనుంది. ఈ వీడియోకాన్ఫరెన్స్ సమయంలో పలు కీలక నిర్ణయాలను మోడీ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు