యూఏఈ:వీసా సంబంధిత జరీమానాలపై ఉపశమనం
- April 02, 2020యూఏఈలో రెసిడెన్సీ మరియు వీసా హోల్డర్స్కి ఊరట. మూడు నెలలపాటు ఓవర్ స్టే జరీమానాల్ని ఉపసంహరిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, యూఏఈ వెలుపల వున్నవారికి కూడా ఈ జరీమానాల ఉపసంహరణ వర్తిస్తుందని చెప్పారు. జిడిఆర్ఎఫ్ఎ సిబ్బంది కోసం రిమోట్ వర్కింగ్ని యాక్టివేట్ చేశామని తెలిపారాయన. ఫ్రంట్లైన్ ఆఫీసుల ఎంట్రీ పాయింట్స్లో కోవిడ్19 పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారాయన.
యూ.ఏ.ఈ వీసాలు ఉన్నవారు ఏదైనా విచారణ కోసం అమెర్ కాల్ సెంటర్ 8005111 కు కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ