విజయవాడలో హై అలర్ట్..
- April 03, 2020
ఏ.పి:భారత దేశంలో కరోనాని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న రోజు రోజుకీ ఈ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడలో 18 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, 14 కేసులు ఢిల్లీ లింకులు అని చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడలోని మూడు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఏర్పాటు అమల్లోకి తీసుకు వచ్చారు. భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేట... ఇలా మూడు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైను ఏపిలో 149 చేరిన కరోనా పాజిటీవ్ కేసులు. నిన్న ఒక్కరోజు 38 కేసులు నమోదు అయ్యాయి. గత రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న కరోనా ఏపిలో విజృంభిస్తుంది. నిన్న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ సైతం ఏపిలో జరుగుతున్న పలు విజయాల గురించి ఆయనకు తెలియజేశారు.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మొత్తానికి ఏపిలో జరుగుతున్న పరిణామాల గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో పర్యవేక్షిస్తున్నారు.భారత దేశ వ్యాప్తంగా కరోనా పై యుద్దం చేస్తూ ఉన్నా రోజు రోజు కీ పెరిగిపోతున్న కేసులను మాత్రం అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







