మార్నింగ్ వాక్కు వెళ్లిన 41 మంది అరెస్ట్..
- April 04, 2020కేరళ:భారత దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధనాకి లాక్ డౌన్ అమలవుతుంటే..ప్రతిరోజు ఉదయం వేళలోనిత్యావసరాలు కోసం ప్రభుత్వం కొద్దిగంటలు వెసులుబాటుకల్పించింది. ఈటైమ్ లో సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి ప్రజలు నిత్యావసరాలను తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ వెసులు బాటును కొందరు దుర్వినియోగం చేసే సరికి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
కేరళలోని కొచ్చిలో పానంబెల్లి నగర్ ప్రాంతంలో కొంతమంది శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నారు. లాక డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి వీరంతా ఉదయం సామూహికంగా మార్నింగ్ వాక్ చేస్తున్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో సర్వైలెన్స్ చేస్తుండగా గుంపులుగా వెళ్తున్న వీరు కనపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన కారణంగా వీరందరిని అరెస్ట్ చేసినట్లు కొచ్చి సౌత్టౌన్ పోలీసుస్టేషన్ ఎస్హెచ్వో తెలిపారు. అనంతరం వీరిని బెయిల్పై విడుదల చేశారు. కేరళలో ఇప్పటివరకు 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!