కువైట్:సొంత దేశాలకు వెళ్లే వారికి సహాయంగా జ్లీప్ లో మరో రెండు కేంద్రాల ఏర్పాటు
- April 05, 2020
కువైట్ సరైనా వీసా, ఇతర డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘించినవారిని తమ సొంత దేశానికి తరలించే ప్రక్రియను కువైట్ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది.కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జరిమానాలు రద్దు చేసి మరీ రెసిడెన్సీ ఉల్లంఘించినవారిని వారి సొంత దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఫర్వానియాలో రెండు సహాయ కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే..రెసిడెన్సీ ఉల్లంఘించినవారి కోసం తాజాగా జ్లీబ్ లో మరో రెండు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జ్లీబ్ అల్-షుయౌఖ్, రుఫైదా అల్-అస్లామియా బాలికల ప్రాధమిక పాఠశాల, 4వ బ్లాక్ 4, స్ట్రీట్ నెంబర్ 200లో మహిళల కోసం ఒక కేంద్రాన్ని, జలీబ్ అల్-షుయౌఖ్, నయీమ్ బిన్ మసౌద్ బాలుర పాఠశాల, 4వ బ్లాక్, 250వ వీధిలో మగవారికి మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఆదివారం నుంచి ఈ సహాయ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు పని చేస్తాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?