కువైట్:సొంత దేశాలకు వెళ్లే వారికి సహాయంగా జ్లీప్ లో మరో రెండు కేంద్రాల ఏర్పాటు
- April 05, 2020
కువైట్ సరైనా వీసా, ఇతర డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘించినవారిని తమ సొంత దేశానికి తరలించే ప్రక్రియను కువైట్ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది.కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జరిమానాలు రద్దు చేసి మరీ రెసిడెన్సీ ఉల్లంఘించినవారిని వారి సొంత దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఫర్వానియాలో రెండు సహాయ కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే..రెసిడెన్సీ ఉల్లంఘించినవారి కోసం తాజాగా జ్లీబ్ లో మరో రెండు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జ్లీబ్ అల్-షుయౌఖ్, రుఫైదా అల్-అస్లామియా బాలికల ప్రాధమిక పాఠశాల, 4వ బ్లాక్ 4, స్ట్రీట్ నెంబర్ 200లో మహిళల కోసం ఒక కేంద్రాన్ని, జలీబ్ అల్-షుయౌఖ్, నయీమ్ బిన్ మసౌద్ బాలుర పాఠశాల, 4వ బ్లాక్, 250వ వీధిలో మగవారికి మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఆదివారం నుంచి ఈ సహాయ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు పని చేస్తాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







