ఫ్రీ బస్సు సర్వీసులు,ట్యాక్సీ ఛార్జీల్లో మినహాయింపు ప్రకటించిన దుబాయ్
- April 05, 2020
దుబాయ్:కీలక రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, అత్యవసరంగా బయటికి వచ్చిన ప్రజల కోసం ఉచితంగా బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు దుబాయ్ రోడ్లు, రవాణా శాఖ ప్రకటించింది. అలాగే ట్యాక్సీల్లోనూ వెళ్లేవారికి 50 శాతం మినహాయింపు ప్రకటించారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు స్టెరిలైజేషన్ (వైరస్ సంహరణకు రసాయనాల పిచికారి) ప్రక్రియను మరో రెండు వారాలు పొడగించిన నేపథ్యంలో మెట్రో, ట్రామ్ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసింది. దీంతో అత్యవసరంగా బయటికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు దుబాయ్ ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రస్తుత సమయం సవాళ్లతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సూచనల మేరకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో వీలైనంత వరకు ప్రజలకు వీలైనంత ఎక్కువ మద్దతు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?