దీపం వెలిగించి సంఘీభావం తెలిపిన ఉపరాష్ట్రపతి
- April 05, 2020
ఢిల్లీ:కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు 130కోట్ల మంది భారతీయులు ఒకేతాటిపై ఉన్నారని చాటిచెప్పాలన్న ఉద్దేశంతో.. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి తమ దృఢ సంకల్పాన్ని ప్రదర్శించడం అభినందనీయం.
కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,సతీమణి ఉషమ్మతో కలిసి తన నివాసంలో రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులు, పేదల ఆకలి తీర్చడంతోపాటు వారికి నీడ కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని మరవొద్దు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్యవార్తల ప్రచారం, వందతుల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
దీప ప్రజ్వలన మనుషులను అజ్ఞానం నుంచి జ్ఞానమార్గంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి వెళ్లేందుకు మార్గదర్శనం చేస్తుంది. ఇదే స్ఫూర్తితో ఇకపైనా ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాన్ని పాటించండి.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!