కరోనాపై షార్ట్ ఫిలిం... కలిసి నటిస్తున్న బిగ్ బి,సూపర్ స్టార్,మెగా స్టార్
- April 06, 2020
కరోనా వైరస్ అవుట్ బ్రేక్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భయానక పరిస్థితుల నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో వైరస్ పట్ల అవేర్నెస్ కలిగించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, ప్రియాంక చోప్రా, రణబీర్ కపూర్, అలియా భట్లతో పాటు మరికొందరు కలిసి ఓ షార్ట్ ఫిలిం ద్వారా కోవిడ్ 19పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింకు ఫ్యామిలీ అనే టైటిల్ను నిర్ణయించారు.
ప్రసూన్ పాండే దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ స్వయంగా పూనుకొని రూపొందిస్తున్న ఈ సినిమా షార్ట్ ఫిలింలో ఇంట్లోనే ఉండటం, జాగ్రత్తలు పాటించటం, పరిశుభ్రత పాటించటం, ఇంటి నుంచే పనులు చేసుకోవటం, సోషల్ డిస్టాన్సింగ్ పాటించటం లాంటి అంశాలలో సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. వియ్ ఆర్ వన్ పేరుతో ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
ఇప్పటికే సోని పిక్చర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్తో కలిసి అమితాబ్ దాదాపు లక్ష కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తున్నారు అమితాబ్. ఈ కార్యక్రమంపై సోనీ పిక్చర్స్ సీఈఓ ఎన్పీ సింగ్, సోని పిక్చర్స్, `కష్టకాలంలో మన మంతా సంఘటితంగా ఈ మహమ్మారిపై పోరాడాల్సిన సమయం వచ్చింది. ఈ సందర్భంగ అమితాబ్ బచ్చన్, కళ్యాణ్ జ్యువెలర్స్తో సినీ టీవీ రంగాల్లో పనిచేస్తున్న రోజూవారి కూలీలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.`
ప్రసూన్ రూపొందిస్తున్న షార్ట్ ఫిలిం విషయానికి వస్తే.. ఈ ఫిలింను పూర్తిగా విర్చువల్ టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది సెలబ్రిటీలు స్వయంగా నటించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిం ఎప్పుడు ఈ ప్లాట్ ఫాంలో ప్రదర్శిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







