కరోనాపై పోరాటం:స్టెరిలైజషన్ చర్యల షెడ్యూల్ ప్రకటించిన అబుధాబి
- April 07, 2020అబుధాబి:కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ క్రిమిసంహారక చర్యలను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో అబుధాబిలో శానిటైజేషన్ డ్రైవ్ సమయాలను ప్రకటించారు. అబుధాబి అధికార వర్గాలు వెల్లడించిన ప్రకటన మేరకు రాజధానిలోని నివాస ప్రాంతాల్లో క్రిమిసంహారక చర్యలు ప్రతీ రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇక పారిశ్రామిక ప్రాంతాలు, కార్మికులు ఉండే ప్రాంతాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) చేస్తారు. రసాయనాల పిచికారి చేస్తున్నందువల్ల ఆయా సమాయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండి తమకు సహకరించాలని అధికారులు కోరారు. మరో రెండు వారాల పాటు ప్రతీ రోజు ఈ స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) ప్రక్రియ కొనసాగనుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు