ఒమన్:పేరెంట్స్ కి ఊరటనిచ్చిన ఇండియన్ స్కూల్స్...జూలై వరకు ఫీజు పెంపు లేదు
- April 07, 2020మస్కట్: ఒమన్లోని ఇండియన్ స్కూల్స్ యాజమాన్యం విద్యార్ధులకు గొప్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 2020 వరకు ఎలాంటి ఫీజు పెంపు లేదని ప్రకటించింది. అంతేకాదు...ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పడకుండా ఫీజు వాయిదాల్లోనూ మార్పు చేసింది. గతంలో మూడు నెలలకు ఓ సారి ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. అయితే..ఒకే సారి ఫీజు చెల్లించటం భారం అయ్యే అవకాశాలు ఉండటంతో నెలవారీగా ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించింది. కరోనా వైరస్ విలయం కారణంగా కొద్ది రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇండియన్ స్కూల్స్ మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ