ఒమన్:పేరెంట్స్ కి ఊరటనిచ్చిన ఇండియన్ స్కూల్స్...జూలై వరకు ఫీజు పెంపు లేదు

- April 07, 2020 , by Maagulf
ఒమన్:పేరెంట్స్ కి ఊరటనిచ్చిన ఇండియన్ స్కూల్స్...జూలై వరకు ఫీజు పెంపు లేదు

మస్కట్: ఒమన్లోని ఇండియన్ స్కూల్స్ యాజమాన్యం విద్యార్ధులకు గొప్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 2020 వరకు ఎలాంటి ఫీజు పెంపు లేదని ప్రకటించింది. అంతేకాదు...ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పడకుండా ఫీజు వాయిదాల్లోనూ మార్పు చేసింది. గతంలో మూడు నెలలకు ఓ సారి ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. అయితే..ఒకే సారి ఫీజు చెల్లించటం భారం అయ్యే అవకాశాలు ఉండటంతో నెలవారీగా ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించింది. కరోనా వైరస్ విలయం కారణంగా కొద్ది రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇండియన్ స్కూల్స్ మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com