ఒమన్:పేరెంట్స్ కి ఊరటనిచ్చిన ఇండియన్ స్కూల్స్...జూలై వరకు ఫీజు పెంపు లేదు
- April 07, 2020
మస్కట్: ఒమన్లోని ఇండియన్ స్కూల్స్ యాజమాన్యం విద్యార్ధులకు గొప్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 2020 వరకు ఎలాంటి ఫీజు పెంపు లేదని ప్రకటించింది. అంతేకాదు...ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పడకుండా ఫీజు వాయిదాల్లోనూ మార్పు చేసింది. గతంలో మూడు నెలలకు ఓ సారి ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. అయితే..ఒకే సారి ఫీజు చెల్లించటం భారం అయ్యే అవకాశాలు ఉండటంతో నెలవారీగా ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించింది. కరోనా వైరస్ విలయం కారణంగా కొద్ది రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇండియన్ స్కూల్స్ మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







