కరోనాపై పోరాటం:స్టెరిలైజషన్ చర్యల షెడ్యూల్ ప్రకటించిన అబుధాబి

- April 07, 2020 , by Maagulf
కరోనాపై పోరాటం:స్టెరిలైజషన్ చర్యల షెడ్యూల్ ప్రకటించిన అబుధాబి

అబుధాబి:కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ క్రిమిసంహారక చర్యలను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో అబుధాబిలో శానిటైజేషన్ డ్రైవ్ సమయాలను ప్రకటించారు. అబుధాబి అధికార వర్గాలు వెల్లడించిన ప్రకటన మేరకు రాజధానిలోని నివాస ప్రాంతాల్లో క్రిమిసంహారక చర్యలు ప్రతీ రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇక పారిశ్రామిక ప్రాంతాలు, కార్మికులు ఉండే ప్రాంతాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) చేస్తారు. రసాయనాల పిచికారి చేస్తున్నందువల్ల ఆయా సమాయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండి తమకు సహకరించాలని అధికారులు కోరారు. మరో రెండు వారాల పాటు ప్రతీ రోజు ఈ స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) ప్రక్రియ కొనసాగనుంది. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com