కరోనాపై పోరాటం:స్టెరిలైజషన్ చర్యల షెడ్యూల్ ప్రకటించిన అబుధాబి
- April 07, 2020
అబుధాబి:కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ క్రిమిసంహారక చర్యలను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో అబుధాబిలో శానిటైజేషన్ డ్రైవ్ సమయాలను ప్రకటించారు. అబుధాబి అధికార వర్గాలు వెల్లడించిన ప్రకటన మేరకు రాజధానిలోని నివాస ప్రాంతాల్లో క్రిమిసంహారక చర్యలు ప్రతీ రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇక పారిశ్రామిక ప్రాంతాలు, కార్మికులు ఉండే ప్రాంతాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) చేస్తారు. రసాయనాల పిచికారి చేస్తున్నందువల్ల ఆయా సమాయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండి తమకు సహకరించాలని అధికారులు కోరారు. మరో రెండు వారాల పాటు ప్రతీ రోజు ఈ స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) ప్రక్రియ కొనసాగనుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







