యూ.ఏ.ఈ :Dh35 మిలియన్ల జాక్ పాట్..లాటరీలో గెలుచుకునే ఛాన్స్
- April 07, 2020యూ.ఏ.ఈ:ప్రతి వారం 35 మిలియన్ల దిర్హామ్స్ గెలుకునే ఛాన్స్ మీ ముందుకు తీసుకువస్తోంది యూఏఈ లాటరీ. డిజిటల్ కలెక్టబుల్స్ స్కీం ద్వారా తొలి ఫత్వా ఆమోదం కలిగిన లాటరీ స్కీంను ప్రారంభించింది. ఏప్రిల్ 18 రాత్రి ఏడున్నరకు లైవ్ స్ట్రీమ్ ద్వారా తొలి డ్రా నిర్వహించనుంది. ఎమిరాతి లోటో లాటరీలు (కలెక్టబుల్ కార్డ్స్) ప్రముఖ యూఏఈ ల్యాండ్ మార్క్ ప్రాంతాలతో పాటు ఆన్ లైన్, ఫోన్ యాప్స్ ద్వారా కొనుక్కోవచ్చు. ఒక్కో కలెక్టబుల్ కార్డు(టికెట్) ధర 35 దిర్హామ్ లుగా నిర్ణయించారు. ఈ లాటరీలో ప్రతీ వారం జాక్ పాట్ ప్రైజ్ మనీగా Dh35 మిలియన్ల నుంచి Dh50 మిలియన్ల వరకు గెలుచుకోవచ్చు. ఆన్ లైన్ డ్రా సిస్టమ్ ద్వారా నిర్వహించే ఈ లాటరీలో ఎమిరాతి లోటో వెబ్ సైట్(www.emiratesloto.com) లో గానీ, యాప్ ద్వారా గానీ ముందుగా ఆరు నెంబర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. డ్రా సమయంలో ఎంచుకున్న ఆరు నెంబర్లతో బాల్ మిషన్ లో నెంబర్లు సరిపోలితే జాక్ పాట్ తగిలినట్టే.
యూఏఈ లాటరీలో ఎంచుకున్న నెంబర్లతో బాల్ మిషన్ చూపించే నెంబర్లు ట్యాలీ అవటాన్ని బట్టి ప్రైజ్ మనీ ఆధారపడి ఉంటుంది. ఒక వేళ టికెట్ కొనుక్కున్న వ్యక్తి ఎంచుకున్న ఆరు నెంబర్లు బాల్ మిషన్ డ్రాలో మ్యాచ్ అయితే జాక్ పాట్ ప్రైజ్ మనీ Dh35 మిలియన్లు సొంతం అవుతాయి. అయితే..ఈ సొమ్మును ఎంత మంది విజేతలు ఉంటే అంతమందికి సమానంగా పంచుతారు. ఒక వేళ 5 నెంబర్లు మాత్రమే మ్యాచ్ అయితే..Dh3,50,000 క్యాష్ ప్రైజ్ దక్కుతుంది. ఇక నాలుగు నెంబర్లు మాత్రమే సరిపోలితే 300 దిర్హామ్ లు, మూడు నెంబర్లు మ్యాచ్ అయితే తర్వాత డ్రాకు ఫ్రీ ఎంట్రీ అవకాశం ఉంటుంది. అయితే..డ్రాలో పాల్గొన్న వారెవరికి ఆరు నెంబర్లు మ్యాచ్ కాకపోతే తర్వాత వారానికి జాక్ పాట్ ప్రైజ్ మని మరో 5 మిలియన్ల దిర్హామ్ లు పెరుగుతుంది. ఇలా 50 మిలియన్ల దిర్హామ్ వరకు పెంచుతూ వెళ్తారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?