ఫుడ్ ప్యాకింగ్పై ఫోకస్ పెట్టిన అసిర్ మునిసిపాలిటీ
- April 07, 2020సౌదీ అరేబియాకి చెందిన అసిర్ మునిసిపాలిటీ, తమ ప్రాంతంలోని రెస్టారెంట్స్ ఫుడ్ ప్యాకింగ్ విషయంలో భద్రత పరంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, భద్రతతో కూడిన పరిశుభ్రమైన ప్యాకింగ్ని వినియోగదారులకు అందించాలని అసిర్ మునిసిపాలిటీ, రెస్టారెంట్లకు సూచించింది. కరోనా వైరస్ తీవ్రత నేపత్యంలో వృద్ధులకు అలాగే డిసేబిలిటీతో బాధపడుతున్నవారి కోసం ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోపక్క, సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, హెల్త్ అవేర్నెస్ని పెంచే క్రమంలో ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ని ప్రారంభించింది. వాట్సాప్ ఛాట్బోట్ వంటివి ఇందులో వున్నాయి. ప్రస్తుతం 2463 కరోనా పాజిటివ్ కేసులు కింగ్డమ్లో వున్నాయి. వీరిలో 488 మంది రికవర్ అవగా, 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!