30వరకు తెలంగాణ కోర్టుల్లో లాక్‌డౌన్‌

- April 07, 2020 , by Maagulf
30వరకు తెలంగాణ కోర్టుల్లో లాక్‌డౌన్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఫుల్‌కోర్టు సమావేశం నిర్వహించిన హైకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న మరోసారి పుల్‌ కోర్ట్‌ సమావేశమై లాక్‌డౌన్‌పై చర్చించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. 

కరోనా కారణంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 364 కేసులు నమోదు కాగా, 11 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 14వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com