యూఏఈ: ఇండియా, పాకిస్తాన్ కు ఫ్లైట్ దుబాయ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం
- April 07, 2020
దుబాయ్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఫ్లై దుబాయ్ ఇండియా, పాకిస్తాన్ కు టికెట్స్ బుకింగ్ ను ప్రారంభించింది. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవటంతో వేల మంది భారతీయులు, పాకిస్తానీయులు యూఈఏలో చిక్కుకుపోయారు. వారిని తమ సొంత దేశాలకు తరలించటంలో భాగంగా వచ్చే వారం ఫ్లై దుబాయ్ రెండు దేశాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉంది. అయితే..భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల నుంచి ఫ్లై దుబాయ్ కి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఒక వేళ అనుమతి వస్తేనే సర్వీసులను పునరుద్ధరిస్తామని ఫ్లై దుబాయ్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 14 తర్వాత భారత్ లో లాక్ డౌన్ సడలించే అవకాశాలు ఉండటంతో తమకు అనుమతి వస్తుందనే ఫ్లై దుబాయ్ అంచనా వేస్తోంది. అయితే..యూఏఈలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మాత్రం తమ దేశానికి ప్రత్యేక విమాన సర్వీసులపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. ఇదిలాఉంటే ఫ్లై దుబాయ్ భారత్ లోని హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కొచ్చి, లక్నో, ముంబై నగరాలకు ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభించింది. అలాగే పాకిస్తాన్ లోని వివిధ నగరాలకు బుకింగ్స్ స్టార్ట్ చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు