కువైట్: భారతీయులకు అమ్నెస్టీ పథకం(క్షమాభిక్ష) తేదీల్లో మార్పు
- April 09, 2020
కువైట్:సరైన డాక్యుమెంట్లు లేని ప్రవాసీయులకు కువైట్ ప్రకటించిన క్షమాభిక్ష పథకం లో స్వల్ప మార్పులు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసీయులు ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఉచితంగా సొంత దేశాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే..ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు సహాయ కేంద్రాలను సంప్రదించేందుకు ప్రత్యేకంగా తేదీలను కూడా కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే భారత్, బంగ్లాదేశ్ కు సంబంధించిన తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న బంగ్లాదేశీయులు ఏప్రిల్ 11 నుంచి 15 వరకు ఫర్వానియాలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించింది. అలాగే ఇండియన్స్ 11 ఏప్రిల్ కి బదులు 16 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ మధ్య సహాయ కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవాలిని మంత్రిత్వ శాఖ తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







