కువైట్: భారతీయులకు అమ్నెస్టీ పథకం(క్షమాభిక్ష) తేదీల్లో మార్పు
- April 09, 2020
కువైట్:సరైన డాక్యుమెంట్లు లేని ప్రవాసీయులకు కువైట్ ప్రకటించిన క్షమాభిక్ష పథకం లో స్వల్ప మార్పులు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసీయులు ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఉచితంగా సొంత దేశాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే..ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు సహాయ కేంద్రాలను సంప్రదించేందుకు ప్రత్యేకంగా తేదీలను కూడా కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే భారత్, బంగ్లాదేశ్ కు సంబంధించిన తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న బంగ్లాదేశీయులు ఏప్రిల్ 11 నుంచి 15 వరకు ఫర్వానియాలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించింది. అలాగే ఇండియన్స్ 11 ఏప్రిల్ కి బదులు 16 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ మధ్య సహాయ కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవాలిని మంత్రిత్వ శాఖ తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







