కువైట్:వాలంటీర్లుగా ప్రైవేట్ వైద్య సిబ్బంది సేవల వినియోగానికి అనుమతి
- April 10, 2020కువైట్:కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది సేవలను వినిగియోంచుకునేందుకు కువైట్ ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వాలంటీర్లుగా డాక్టర్లు, నర్సులు సేవలు అందించాలని కోరింది. కరోనా వైరస్ పై పోరాటంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో తమ బాధ్యతగా భాగస్వామ్యం కావాలనుకునే డాక్టర్లు, నర్సులు ఏప్రిల్ 12 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని విశ్వాసం వ్యక్తం చేసింది. వైద్య సాయం అందించాలనుకునే డాక్టర్లు అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ టెక్నికల్ అఫైర్స్ ఆఫీసులో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే నర్సులు అయితే అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ మెడికల్ సర్వీసెస్ లో దరఖాస్తు చేయాలి. ఏప్రిల్ 12 నుంచి మూడు రోజుల పాటు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ తో పాటు ప్రాక్టిసింగ్ లైసెన్స్, సివిల్ ఐడీ కార్డు, వారు పని చేసే కంపెనీ నుంచి అనుమతి లేటర్ ను జత చేయాల్సి ఉంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ