గల్ఫ్ లో వలసదారులు సేఫ్‌: ఎమర్జన్సీ విమానాల ఆలోచన లేదు

- April 10, 2020 , by Maagulf
గల్ఫ్ లో వలసదారులు సేఫ్‌: ఎమర్జన్సీ విమానాల ఆలోచన లేదు

యూ.ఏ.ఈ అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లోని భారతీయులంతా సేఫ్‌గా వున్నారనీ, అత్యవసరంగా ఎవర్నీ స్వదేశానికి తరలించాల్సిన పని లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారనీ, అక్కడి భారతీయుల యోగ క్షేమాల్ని తెలుసుకుంటున్నారనీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. తాజా లెక్కల ప్రకారం గల్ఫ్ రీజియన్‌లో 1,400 మంది భారతీయులకు కరోనా వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. అయితే, యూఏఈ మరియు గల్ఫ్ దేశాల్లో బాధితులకు వైద్య చికిత్స అందుతోందని ఫారిన్‌ మినిస్ట్రీ సెక్రెటరీ వెస్ట్‌ వికాస్‌ స్వరూప్‌ చెప్పారు. కాగా, కార్గో విమానాల ఆపరేషన్స్‌ యధాతథంగా కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com