చెట్టినాడ్ ఫిష్ కర్రీ
- January 26, 2016
కావలసిన పదార్థాలు: చేప ముక్కలు: ఐదు లేక ఆరు, ఉల్లిపాయ: ఒకటి(సన్నగా తరిగి పెట్టుకోవాలి), టమోటా: ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి), చింతపండు గుజ్జు: టేబుల్ స్పూను, పసుపు: అర టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు: కొద్దిగా, నూనె: తగినంత, మెంతులు: అర టీస్పూను, ఆవాలు: అర టీస్పూను, చిన్న ఉల్లిపాయలు: ఆరు లేక ఏడు, వెల్లుల్లి రెమ్మలు: నాలుగు లేక ఐదు, టమోటా:ఒకటి, కరివేపాకు: కొద్దిగా. మసాలా కోసం: కొబ్బరి పొడి: అరకప్పు, ధనియాల పొడి: టేబుల్ స్పూను, కారం పొడి: టేబుల్ స్పూను,
తయారీ విధానం: ముందుగా మసాలా దినుసులన్నీ మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొద్దిగా నూనె వేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించి అనంతరం వీటిని కూడా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేసి మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు, చిన్నఉల్లిపాయ ముక్కలు, టమొటా ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్ద, ఉల్లిపాయ ముద్ద వేసి కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతున్న సమయంలోనే ఉప్పు, కూడా జతచేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను నెమ్మదిగా వేసి మూడు లేక నాలుగు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









