చెట్టినాడ్ ఫిష్ కర్రీ
- January 26, 2016
కావలసిన పదార్థాలు: చేప ముక్కలు: ఐదు లేక ఆరు, ఉల్లిపాయ: ఒకటి(సన్నగా తరిగి పెట్టుకోవాలి), టమోటా: ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి), చింతపండు గుజ్జు: టేబుల్ స్పూను, పసుపు: అర టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు: కొద్దిగా, నూనె: తగినంత, మెంతులు: అర టీస్పూను, ఆవాలు: అర టీస్పూను, చిన్న ఉల్లిపాయలు: ఆరు లేక ఏడు, వెల్లుల్లి రెమ్మలు: నాలుగు లేక ఐదు, టమోటా:ఒకటి, కరివేపాకు: కొద్దిగా. మసాలా కోసం: కొబ్బరి పొడి: అరకప్పు, ధనియాల పొడి: టేబుల్ స్పూను, కారం పొడి: టేబుల్ స్పూను,
తయారీ విధానం: ముందుగా మసాలా దినుసులన్నీ మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొద్దిగా నూనె వేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించి అనంతరం వీటిని కూడా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేసి మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు, చిన్నఉల్లిపాయ ముక్కలు, టమొటా ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్ద, ఉల్లిపాయ ముద్ద వేసి కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతున్న సమయంలోనే ఉప్పు, కూడా జతచేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను నెమ్మదిగా వేసి మూడు లేక నాలుగు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







