మస్కట్:ప్రాధాన్యత ప్రకారమే తరలింపు..భారతీయుల విజ్ఞప్తిపై రాయబార కార్యాలయం స్పష్టత
- April 12, 2020మస్కట్:అత్యవసరంగా భారత్ కు వెళ్లాలనుకునే వారు విమాన సర్వీసులు పునరుద్ధరించే వరకు వేచి చూడాల్సిందేనని ఒమన్ లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం వరకు అంతా వేచి చూడాల్సిందేనని స్పష్టం చేసింది. తాము అత్యవసరంగా భారత్ వెళ్లాలంటూ రాయబార కార్యాలయానికి ఎక్కువ సంఖ్యలో ఈ మేల్స్, ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఒమన్ భారత రాయబారి మును మహవర్ ఈ ప్రకటన చేశారు. అయితే..విమానాల సర్వీసులు పునరుద్దరించిన వెంటనే అత్యవసరం ఉన్నవారికే మొదటి ప్రధాన్యం ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ వెళ్లాలనుకునే వారు తమ వివరాలను పొందుపర్చేందుకు ప్రత్యేకంగా గూగుల్ ఫామ్ ను క్రియేట్ చేసింది. అందులో సొంత దేశానికి వెళ్లాలనుకుంటున్న వారు తమ కాంటాక్ట్ నెంబర్లతో పాటు ఏ అవసరం కారణంగా వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా పేర్కొవాలి. విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత అత్యవసరం అనుకున్న వారికి తొలి ప్రధాన్యత క్రమంలో జర్నీ ఏర్పాట్లు చేయనున్నట్లు మును మహవర్ స్పష్టం చేశారు. అయితే..ప్రయాణం ఎప్పుడు అనే విషయంపై రాయబార కార్యాలయాన్ని పదే పదే సంప్రదించాల్సిన అవసరం లేదని, విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రధాన్యత క్రమాన్ని బట్టి మేమే వాళ్లను సంప్రదిస్తామని కూడా ఆయన తెలిపారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్