మస్కట్:ప్రాధాన్యత ప్రకారమే తరలింపు..భారతీయుల విజ్ఞప్తిపై రాయబార కార్యాలయం స్పష్టత
- April 12, 2020
మస్కట్:అత్యవసరంగా భారత్ కు వెళ్లాలనుకునే వారు విమాన సర్వీసులు పునరుద్ధరించే వరకు వేచి చూడాల్సిందేనని ఒమన్ లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం వరకు అంతా వేచి చూడాల్సిందేనని స్పష్టం చేసింది. తాము అత్యవసరంగా భారత్ వెళ్లాలంటూ రాయబార కార్యాలయానికి ఎక్కువ సంఖ్యలో ఈ మేల్స్, ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఒమన్ భారత రాయబారి మును మహవర్ ఈ ప్రకటన చేశారు. అయితే..విమానాల సర్వీసులు పునరుద్దరించిన వెంటనే అత్యవసరం ఉన్నవారికే మొదటి ప్రధాన్యం ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ వెళ్లాలనుకునే వారు తమ వివరాలను పొందుపర్చేందుకు ప్రత్యేకంగా గూగుల్ ఫామ్ ను క్రియేట్ చేసింది. అందులో సొంత దేశానికి వెళ్లాలనుకుంటున్న వారు తమ కాంటాక్ట్ నెంబర్లతో పాటు ఏ అవసరం కారణంగా వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా పేర్కొవాలి. విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత అత్యవసరం అనుకున్న వారికి తొలి ప్రధాన్యత క్రమంలో జర్నీ ఏర్పాట్లు చేయనున్నట్లు మును మహవర్ స్పష్టం చేశారు. అయితే..ప్రయాణం ఎప్పుడు అనే విషయంపై రాయబార కార్యాలయాన్ని పదే పదే సంప్రదించాల్సిన అవసరం లేదని, విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రధాన్యత క్రమాన్ని బట్టి మేమే వాళ్లను సంప్రదిస్తామని కూడా ఆయన తెలిపారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







