యూఏఈ: లాక్ డౌన్ తర్వాతే ఇండియా వెళ్లేందుకు అనుమతి...
- April 12, 2020
అబుధాబి:లాక్ డౌన్ ముగిసే వరకు ప్రవాసీయులు ఎవరికీ భారత్ వెళ్లే అవకాశమే లేదని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేసేందుకు భారత్ ప్రస్తుతం కట్టుదిట్టమైన నిబంధనలు అమలులో ఉన్నాయని, దేశమంతా పూర్తిగా లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయని, ఈ సమయంలో ప్రభుత్వం ప్రవాసీయులను దేశంలోకి అనుమతిని ఇచ్చే ఉద్దేశంతో లేదని భారత రాయబారి పవన్ కపూర్ స్పష్టత ఇచ్చారు. అయితే..భారత ప్రభుత్వ ఉద్దేశం ప్రవాసీయులను అలక్ష్యం చేయటం కాదని కూడా ఆయన తెలిపారు. కేవలం కరోనా కట్టడి కోసం అటు దేశ ప్రజలు, ఇటు ప్రవాసీయుల కుటుంబాలు బాగుండాలనే యోచనే తప్ప ప్రవాసీయులను పట్టించుకోవడం అనే ప్రస్తావనే లేదని ఆయన వివరించారు. విదేశాల నుంచి భారత్ కు తిరిగి వెళ్తున్న ప్రవాసీయుల్లో ముందుగా కరోనా నెగటీవ్ వచ్చినా కూడా కొద్ది రోజుల తర్వాత వారిలో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అవుతున్న కేసులను పవన్ కపూర్ ఉదాహరణ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా విదేశాల నుంచి భారత్ కు వస్తున్న ప్రవాసీయుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని...ఈ పరిణామం కరోనా కట్టడి విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల ప్రయోజనాల కోసం విదేశాల్లోని భారతీయులు ఎక్కడివారు అక్కడే ఉండటం ఎంతో శ్రేయస్కరమని ఆయన హితువుపలికారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే దశల వారీగా ప్రవాసీయులను తరలిస్తామన్నారు.
యూఏఈలోని భారతీయుల సంరక్షణ తమ బాధ్యతని, వారిని అన్ని రకాలు సహాయ సహాకారాలు అందిస్తామన్నారు. అందుకు యూఏఈ అధికారులు కూడా తోడ్పాటు అందిస్తారని తాను విశ్వస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు విదేశీయులు అందరికీ ఆరోగ్య సంరక్షణ కోసం యూఏఈ అధికార వర్గాలు తగిన చర్యలు తీసుకుంటోందని ప్రశంసించారు. అలాగే కోవిడ్ పై పోరాటంలో ప్రవాస భారతీయులు కూడా యూఏఈ అధికారులకు పూర్తి సహయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యాపారులు, విద్యా సంస్థ వర్గాలు అధికారుల కోరితే క్వారంటైన్ కోసం తమ భవనాలను కేటాయించాలని ఆయన కోరారు. ఇదిలాఉంటే వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికుల్లో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఇప్పటికే పలు లేబర్ క్యాంప్స్ లు సందర్శించానని, కార్మికులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని పవన్ కపూర్ వివరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







