జీవితాంతం వారికి రుణపడి ఉంటా:బోరిస్ జాన్సన్
- April 12, 2020
లండన్:తనకు చికిత్స అందించిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని కరోనా నుంచి కోలుకొని ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తొలి వ్యాఖ్యల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. వారం రోజుల క్రితం బోరిస్ కరోనా లక్షణాలతో సెంట్రల్ లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో చేరారు. అయితే వ్యాధి లక్షణాలు ఎక్కువకావడంతో ఆయన్ని ఏప్రిల్ 6వ తేదీన ఐసీయూలో ఉంచి చికిత్స అందించి.. ఏప్రిల్ 9వ తేదీన జనరల్ వార్డుకు మార్చారు. శుక్రవారం నాటికి ఆయన స్వయంగా లేచి నడిచారని.. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదటపడుతుందని ఆయన అధికారిక కార్యాలయం వెల్లడించింది.
అయితే తనకు వైద్యం అందించిన వాళ్లకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని బోరిస్ అన్నారు. వాళ్లు నాకు చేసిన సేవకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను అని ఆయన తెలిపారని.. హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు