కువైట్:వీసా నిబంధనలు పాటించని ప్రవాసీయుల కేంద్రాలను పరిశీలించిన ఉప ప్రధాని
- April 12, 2020
కువైట్:నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను ఉప ప్రధాని, అంతర్గత మంత్రిత్వ వ్యవహారాల శాఖ అనస్ అల్ సలెహ్ పరిశీలించారు. కబద్ లోని శిబిరాలను పరిశీలించిన ఆయన..అక్కడి వసతులు, భద్రత ఏర్పాట్లు, శిబిరాల్లోని ప్రశాసీయుల పరిస్థితులను పరిశీలించారు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన జ్లీప్ అల్-షోయౌఖ్ జిల్లాలోని ముందస్తు భద్రత చర్యలను ఆయన తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించేందుకు ఉన్న అవకాశాలపై ఆరా తీయటంలో భాగంగా ఆయా ప్రాంతంలో పర్యటించారు. లాక్ డౌన్ విధించేందుకు అవసరమైన పరిస్థితులు, భద్రత ఏర్పాట్ల సన్నద్దత గురించి ఆయన అధికారులను అడిగితెల్సుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







