రియాద్:లంచం తిరస్కరించిన పోలీస్ అధికారిపై దాడి
- April 12, 2020
రియాద్:ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పాటించకుండా కొందరు యువకులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. అడ్డుకున్న పోలీసులపైనే దాడులు చేస్తున్నారు. సౌదీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వీకెండ్ కావటంతో ఓ యువకుడు లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ బైక్ పై రోడ్డెక్కాడు. అయితే..గస్తీలో ఉన్న పోలీసు అతన్ని ఆపటంతో అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే..ఆ పోలీస్ అధికారి లంచం తీసుకునేందుకు నిరాకరించటంతో ఏకంగా అఫీసర్ పైనే దాడికి తెగడబ్డాడు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశాడు. దీంతో అవినీతి నిరోధక శాఖ ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి తుదపరి విచారణకు తరలించింది. ఇదిలాఉంటే..మరో కేసులో తీర్పులను ప్రభావితం చేసేలా జడ్జి, మిలటరీ కల్నల్ లంచం తీసుకున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టినట్టు అవినీతి శాఖ అధికారులు వెల్లడించారు. జడ్జి, కల్నల్ ఇద్దరు అన్నాదమ్ములని, ఈ కేసులో ఓ వ్యాపారవేత్త, మరో న్యాయవాది ప్రమేయం కూడా ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?